నిర్మల్ జిల్లా 26ఆగస్ట్ (పున్నమి ప్రతినిధి) ఈనెల 29న మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా ఉదయం 9 గంటలకు నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియం నుండి అంబేద్కర్ మినీ ట్యాంక్ బండ్ వరకు వెళ్లి మళ్లీ తిరిగి ఎన్టీఆర్ స్టేడియం వరకు ర్యాలీగా వచ్చే కార్యక్రమంలో జిల్లాలోని సీనియర్ క్రీడాకారులు పీడి/పీఈటీలు ఉత్సాహవంతులు ర్యాలీలో పాల్గొనాలని జిల్లా యువజన క్రీడల అధికారి శ్రీకాంత్ రెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు. గత సంవత్సరం సీఎం కప్ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులకు సన్మాన కార్యక్రమం సైతం ఉంటుందని తెలిపారు.


