Wednesday, 11 February 2026
  • Home  
  • క్రీడాకారుల్లో ఉత్సాహం ఉరకలు, అభిమానుల కేరింతల మధ్య బ్యాట్‌ పట్టిన ఎమ్మెల్యే వాసు.
- తూర్పు గోదావరి

క్రీడాకారుల్లో ఉత్సాహం ఉరకలు, అభిమానుల కేరింతల మధ్య బ్యాట్‌ పట్టిన ఎమ్మెల్యే వాసు.

తమ కుటుంబ సభ్యులైన తెలుగుదేశం పార్టీ నాయకులు, యువకులను ఉత్సాహ పరిచేందుకే తాము క్రికెట్‌ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ (వాసు) అన్నారు. క్రికెట్‌ అభిమానులు, స్థానిక నాయకులు, కార్యకర్తల కేరింతల మధ్య ఆయన బ్యాట్‌ పట్టి బంతిని బాది, క్రీడాకారులకు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. సుమారు 10 రోజుల పాటు పేపరు మిల్లు సమీపంలోని లూధరగిరి మైదానంలో జరగనున్న రాజమండ్రి సిటీ తెలుగుదేశం పార్టీ క్రికెట్‌ టోర్నమెంట్‌ను ఎమ్మెల్యే ముఖ్య అతిధిగా ప్రారంభించారు. జట్ల ఎంపిక, మ్యాచ్‌ల డ్రా అనంతరం ఆయన మాట్లాడారు. పార్టీ కోసం పని చేస్తూ, ప్రజా క్షేత్రంలో ఉంటూ ఒత్తిడికి గురయ్యే తమ పార్టీ నాయకులను ఉత్సాహ పరచడం కోసం, వారిలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ఈ టోర్నమెంట్‌ను నిర్వహిచడం జరుగుతోందన్నారు. క్రీడలు సమాజ అభివృద్ధిలో, ఆరోగ్య సంరక్షణలో, యువతకి స్ఫూర్తి కల్పించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయన్నారు. క్రీడల ద్వారా నాయకత్వ లక్షణాలు, సామాజిక విలువలు, సహనం, జీవన నైపుణ్యాలు అలవడతాయన్నారు. ప్రతి ఒక్కరూ క్రీడల్లో ప్రవేశించి తన ఆరోగ్యం, నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం కూడా క్రీడాకారులకు ప్రోత్సాహం కల్పించేందుకు ఎన్నో చర్యలు తీసుకుంటోందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

తమ కుటుంబ సభ్యులైన తెలుగుదేశం పార్టీ నాయకులు, యువకులను ఉత్సాహ పరిచేందుకే తాము క్రికెట్‌ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ (వాసు) అన్నారు. క్రికెట్‌ అభిమానులు, స్థానిక నాయకులు, కార్యకర్తల కేరింతల మధ్య ఆయన బ్యాట్‌ పట్టి బంతిని బాది, క్రీడాకారులకు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. సుమారు 10 రోజుల పాటు పేపరు మిల్లు సమీపంలోని లూధరగిరి మైదానంలో జరగనున్న రాజమండ్రి సిటీ తెలుగుదేశం పార్టీ క్రికెట్‌ టోర్నమెంట్‌ను ఎమ్మెల్యే ముఖ్య అతిధిగా ప్రారంభించారు. జట్ల ఎంపిక, మ్యాచ్‌ల డ్రా అనంతరం ఆయన మాట్లాడారు. పార్టీ కోసం పని చేస్తూ, ప్రజా క్షేత్రంలో ఉంటూ ఒత్తిడికి గురయ్యే తమ పార్టీ నాయకులను ఉత్సాహ పరచడం కోసం, వారిలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ఈ టోర్నమెంట్‌ను నిర్వహిచడం జరుగుతోందన్నారు. క్రీడలు సమాజ అభివృద్ధిలో, ఆరోగ్య సంరక్షణలో, యువతకి స్ఫూర్తి కల్పించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయన్నారు. క్రీడల ద్వారా నాయకత్వ లక్షణాలు, సామాజిక విలువలు, సహనం, జీవన నైపుణ్యాలు అలవడతాయన్నారు. ప్రతి ఒక్కరూ క్రీడల్లో ప్రవేశించి తన ఆరోగ్యం, నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం కూడా క్రీడాకారులకు ప్రోత్సాహం కల్పించేందుకు ఎన్నో చర్యలు తీసుకుంటోందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.