పెనగలూరు ఆగస్టు (పున్నమి ప్రతినిధి)
కోడూరు నియోజకవర్గం ప్రజలకు ఉపయోగపడే విధంగా ముక్కా రూపానంద రెడ్డి ఆధ్వర్యంలో శ్రీ శక్తి ఫ్రీ బస్ పథకాన్ని ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా యువ నాయకుడు మదన్ మాట్లాడుతూ –
“ప్రజలకు మేలు చేసే ఈ పథకం ప్రారంభించడం ఆనందదాయకం. రవాణా సౌకర్యం లేని ప్రాంత ప్రజలకు ఇది ఎంతో ఉపయుక్తం కానుంది. ఇటువంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా కొనసాగాలని నా ఆకాంక్ష” అని తెలిపారు.


