పున్నమి న్యూస్(కోనసీమ): సీనియర్ జర్నలిస్ట్ రమణ: అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం గ్రామంలో కొత్తగా పెన్షన్ మంజూరైన వారికి బుధవారం ఉదయం గ్రామ ఎన్డీయే కూటమి నేతలు సచివాలయ ఉద్యోగుల ద్వారా పెన్షన్ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు అందజేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామంలో ఉన్న కూటమి నేతలు పాల్గొన్నారు.


