కామారెడ్డి,23 జనవరి,( పున్నమి ప్రతినిధి ) :
కుటుంబ సమస్యలతో మంగలి లింబయ్య అనే వ్యక్తి గుర్తు తెలియని గడ్డి మందు తాగి మృతి చెందిన సంఘటన చోటుచేసుకుందని ఎస్సై రాజ శేఖర్ తెలిపారు. ఎస్ఐ కథనం మేరకు వివరా లు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో గడ్డి మందు మరణాలు దారు ణంగా కనిపిస్తున్నాయి. మొదట రామారెడ్డి గ్రామానికి చెందిన 43 ఏండ్ల మంగళి లింబాద్రీ కుటుంబ సమస్యలతో గడ్డి మందు తాగి ప్రాణాలు కోల్పోయారు.మంగలి కులానికి చెందినవారు. కులవృత్తి చేస్తూ జీవణం కొనసాగిస్తున్నారు. కుటుంబ సభ్యులు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుప త్రికి తరలించగా, చికిత్స పొందుతూ గురువారం రాత్రి చనిపోయారు.కుటుంబ సమస్యలు పరిణా మాలుగా ఈ ఘటనలు జరిగాయని స్థానికులు తెలిపారు.రెండు మరణాలూ రామారెడ్డి మండలం లోనే జరగడంతో ప్రజల్లో భయం వాతావరణం నెలకొంది.పోలీసులు కేసుల్లో విచారణ చేపడుతు న్నట్లు ఎస్ఐ వివరించారు.


