శ్రీకాళహస్తి నవంబర్ 02 , పున్నమి న్యూస్ : శ్రీకాకుళం జిల్లా పలాసలోని కాశీ బుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయం లో స్వామి వారి దర్శనం సమయంలో భక్తుల రద్దీ ఘటనలో భక్తులు మరణించడం దురదృష్టకరమని శ్రీ కాళహస్తి మాజీ ఎమ్మెల్యే శ్రీ ఎస్సీవీ నాయుడు విచారం వ్యక్తం చేశారు. సంఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించి క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి పంపించడంతో పాటు క్యూలైన్లను వెంటనే క్రమబద్ధీకరించి ఎటువంటి ఆటంకాలు లేకుండా సహాయక చర్యలు చేపట్టారని ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తు వారి కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భారీగా భక్తులు తరలిరావడంతో, తొక్కిసలాట జరిగిందని, వేల మంది భక్తులు రావడం, మొదటి అంతస్తులో గుడి ఉండటం, ఇరుకు ద్వారం గుండా ప్రవేశం కూడా ప్రమాదానికి కారణమని మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు పేర్కొంటూ మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మృతి చెందిన భక్తుల వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తూన్నానని ఆయన తెలిపారు.

కాశీబుగ్గలో తొక్కిసలాట దురదృష్టకరం -మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు
శ్రీకాళహస్తి నవంబర్ 02 , పున్నమి న్యూస్ : శ్రీకాకుళం జిల్లా పలాసలోని కాశీ బుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయం లో స్వామి వారి దర్శనం సమయంలో భక్తుల రద్దీ ఘటనలో భక్తులు మరణించడం దురదృష్టకరమని శ్రీ కాళహస్తి మాజీ ఎమ్మెల్యే శ్రీ ఎస్సీవీ నాయుడు విచారం వ్యక్తం చేశారు. సంఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించి క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి పంపించడంతో పాటు క్యూలైన్లను వెంటనే క్రమబద్ధీకరించి ఎటువంటి ఆటంకాలు లేకుండా సహాయక చర్యలు చేపట్టారని ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తు వారి కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భారీగా భక్తులు తరలిరావడంతో, తొక్కిసలాట జరిగిందని, వేల మంది భక్తులు రావడం, మొదటి అంతస్తులో గుడి ఉండటం, ఇరుకు ద్వారం గుండా ప్రవేశం కూడా ప్రమాదానికి కారణమని మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు పేర్కొంటూ మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మృతి చెందిన భక్తుల వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తూన్నానని ఆయన తెలిపారు.

