స్టీల్ ప్లాంట్, జనవరి 30, పున్నమి ప్రతినిధి.
కార్మిక హక్కుల పరిరక్షణ, ఉక్కు కార్మిక లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఉక్కు ఐఎన్టియుసి ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం ఉక్కు బి.సి. గేట్ ధర్నా నిర్వహించారు. ఉక్కు ఐఎన్టియుసి అధ్యక్షులు పి.వి. రమణమూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నా లో కార్మిక సమస్యలు అయిన
నవంబర్ 15 సర్కిలార్ ని విత్డ్రా చేస్తూ ఉత్పత్తికి తో సంబంధం లేకుండా పూర్తి జీతాలు చెల్లించాలి, వేతన బకాయిలు సకాలంలో చెల్లించాలి, నిలుపుదల చేసిన హెచ్ఆర్ఏ ను యధాతధంగా కొనసాగించాలి, టౌన్షిప్ లో కరెంట్ బిల్లును తగ్గించి పూర్వ పద్ధతిలో కొనసాగించాలి, ఎంప్లాయిస్ షఫ్లింగ్ అదే డిపార్ట్మెంట్కు పరిమితం చేయాలని, ఉక్కును సెయీల్ లో విలీనం చేయాలనీ , తొలగించి న కాంట్రాక్ట్ వర్కర్స్ ను తిరిగి తీసుకోవాలి డిమాండ్ చేశారు. ఉ కార్యక్రమం లో ఉక్కు ఐఎన్టియుసి నాయకులు నీరుకొండ రామచంద్ర, మంత్రి. గోపి నారాయణ, పోలీస్ నాయుడు తదితరులు పాల్గొన్నారు



