గాజువాక, అక్టోబర్ (పున్నమి ప్రతినిధి)
పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు,
గాజువాక నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తిప్పల శ్రీనివాస్ దేవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కల్తీ మద్యం వ్యతిరేకంగా విస్తృతమైన ర్యాలీ నిర్వహించారు.
నేడు శ్రీనగర్ సుందరయ్య కాలనీ మున్నా ట్యాంక్ దగ్గర గల ఆంజనేయ స్వామి ఆలయం వద్ద నుండి ప్రారంభమైన ర్యాలీ, కొత్త దిబ్బపాలం ఎక్సైజ్ కార్యాలయం వరకు కొనసాగి, అక్కడ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వారికి వినతిపత్రం అందజేయబడింది.
ఈ కార్యక్రమంలో విశాఖ పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు కదిరి బాబురావు, గాజువాక నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు తైనాల విజయ్కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
వైసీపీ నాయకులుమాట్లాడుతూ
“తెలుగుదేశం ప్రభుత్వం నకిలీ మద్యం తయారిని ఒక కుటీర పరిశ్రమలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రోత్సహిస్తూ ప్రజల ప్రాణాలను హరిస్తున్న పరిస్థితుల్లో, ఆ అన్యాయానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా పోరాట బాట పట్టాం” అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం లో
71వ వార్డు అధ్యక్షుడు భూపతి రాజు శ్రీనివాస్,
కార్పొరేటర్లు మహమ్మద్ ఇమ్రాన్, భూపతి రాజు సుజాత, గుడివాడ లతీష్, ఊరుకోటి చందు, ధర్మాల శ్రీనివాసరావు, పళ్ళ చిన్న తల్లి, బోగాది సన్నీ, షౌకత్ అలీ, గొండేసి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి శంకర్ నారాయణ, పూర్ణ శర్మ, బొడ్డ గోవింద్,
సీనియర్ నాయకులు ఉరుకుటి అప్పారావు, రాజాన వెంకటరావు, మహమ్మద్ గౌస్, జి.వి. రమణ, చిత్రాడ వెంకటరమణ, కొయ్య భారతి, ఎన్నిటి రమణ, ప్రగడ శ్రీను, ప్రగడ సన్యాసిరావు, దుగ్గపు దానప్పులు, దామోదర్, తిప్పల గోపి, కటికల కల్పన, రామలక్ష్మి, కనకమహాలక్ష్మి, హరీష్ వర్మ, వెంకటేష్, సలీం తదితరులు పాల్గొన్నారు.


