నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో బుధవారం ఎన్.పిఆర్.డి. దివ్యాంగుల సంఘం నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు మీసాల కురుమయ్య మాట్లాడుతూ, వికలాంగుల సమస్యల పరిష్కారం కోసం గురువారం కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తున్నామని, ఈ ముట్టడిలో జిల్లాలోని వికలాంగుల అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో నాగర్ కర్నూల్ మండల కార్యదర్శి మాణిక్యం, గౌరవ అధ్యక్షుడు తిరుపతయ్య, నాయకులు ధర్మయ్య, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ కార్యాలయం ముట్టడిని విజయవంతం చేయండి
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో బుధవారం ఎన్.పిఆర్.డి. దివ్యాంగుల సంఘం నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు మీసాల కురుమయ్య మాట్లాడుతూ, వికలాంగుల సమస్యల పరిష్కారం కోసం గురువారం కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తున్నామని, ఈ ముట్టడిలో జిల్లాలోని వికలాంగుల అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో నాగర్ కర్నూల్ మండల కార్యదర్శి మాణిక్యం, గౌరవ అధ్యక్షుడు తిరుపతయ్య, నాయకులు ధర్మయ్య, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

