*కనక మహాలక్ష్మి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే శ్రీ వంశీ కృష్ణ శ్రీనివాస్*
*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి*
కుటుంబ సమేతంగా కనక మహాలక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకున్న ఎమ్మెల్యే దంపతులు
వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాం
కోరిన కోరికలు తీర్చే అమ్మవారిని వేడుకను ప్రారంభించడం నా పూర్వ జన్మ సుకృతం
మార్గశిర మాసోత్సవాల్లో
దాదాపు 6 లక్షలకు పైగా భక్తులు వచ్చే అవకాశం
పోలి పాడ్యమి కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున వస్తున్న భక్తులు
ఆలయ ప్రాంగణంలో అదనపు ప్రసాద కౌంటర్లు ఏర్పాటు చేసిన దేవస్థానం.
ఈ నెల రోజుల పాటు అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశాం.
కనక మహాలక్ష్మి అమ్మ వారి అనుగ్రహం మన విశాఖ కు రాష్ట్రానికి ఉండాలి.
రాష్ట్ర ప్రజలు సకల ఐశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరిన ఎమ్మెల్యే.
ఈరోజు దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు బురుజుపేటలో కొలువైన శ్రీ శ్రీ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మ వారి ఆలయంలో జరిగే మార్గశిర మాసోత్సవములను సాంప్రదాయపద్ధంగా ప్రారంభించారు. అమ్మవారి గర్భాలయంలో ప్రత్యేక పూజ నిర్వహించారు. అనంతరం అమ్మవారి మండపంలో మార్గశిర మాస పూజను నిర్వహించారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ కోరిన కోరికలు తీర్చే అమ్మవారి వేడుకను ప్రారంభించడం నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నానని తెలిపారు. సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు తో పాటు అదనపు ప్రసాద కౌంటర్లు ఏర్పాటు చేశామని అన్నారు. కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీమతి శోభారాణి , ఏఈఓ ఆనంద్ రాజేంద్ర , ఈ ఈ రమణ , ఆలయ అర్చకులు పాల్గొన్నారు….


