పున్నమి: అబ్దుల్లాపూర్ మెంట్ మండలం రంగారెడ్డి జిల్లా: ఇన్ఫోసిస్ లో ఉద్యోగం చేస్తున్న ఎనిమిది మంది ఉద్యోగులు దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక యువతి మృతి, ఏడుగురికి తీవ్ర గాయలయ్యాయి. ఈ ఘటన అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అబ్దుల్లా పూర్ మెట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా, జిన్నారం మండలం, వావిలాల గ్రామానికి చెందిన రాళ్లకత్వా వెంకటేశ్వర్ రెడ్డి(51) అతని కుమార్తె సౌమ్య రెడ్డి(25) హైదరాబాద్ లోని ఇన్ఫోసిస్ లో ఉద్యోగం చేస్తుంది. కాగా ఆదివారం సెలవు దినం కావడంతో ఆమె సహోద్యోగులు వీరేంద్ర(26), నంద కిషోర్, ప్రణీష్, సాగర్, అరవింద్, జాన్సీ, శృతి లు మొత్తం ఎనిమిది మంది హైదరాబాద్ శివారు రాచకొండలోని సరళ మైసమ్మ తల్లి ఆలయానికి ఇన్నోవా క్రిస్టా కారులో వెళ్లారు. వాళ్ళు దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం బొంగ్లూర్ ఉన్న ఓఆర్ఆర్ లోకి ప్రవేశించారు. కాగా ఆదివారం రాత్రి 7.30గంటల సమయంలో అబ్దుల్లాపూర్మెట్ మండలం బలిజగూడ గ్రామ పరిధిలోకి చేరుకోగానే కారును డ్రైవింగ్ చేసిన వీరేందర్ అతివేగం కారణంగా నియంత్రణ కోల్పోయి ఓఆర్ఆర్ డివైడర్ ను బలంగా ఢీ కొట్టారు. దీంతో కారు పెద్ద అంబర్ పేట సైడ్ రోడ్డు వైపు తిరిగింది. దాని ఫలితంగా, అందరికీ తీవ్ర రక్తస్రావం కావడంతో వారిని వెంటనే హయత్ నగర్ లోని సన్ రైజ్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సౌమ్యరెడ్డి, నందకిషోర్ లను మెరుగైన చికిత్స కోసం ఉప్పల్ లోని సిటీ న్యూరో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాళ్లకత్వా సౌమ్య రెడ్డి మృతి చెందింది. దీంతో ఆమె తండ్రి అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం.. యువతి మృతి, ఏడుగురికి తీవ్ర గాయాలు
పున్నమి: అబ్దుల్లాపూర్ మెంట్ మండలం రంగారెడ్డి జిల్లా: ఇన్ఫోసిస్ లో ఉద్యోగం చేస్తున్న ఎనిమిది మంది ఉద్యోగులు దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక యువతి మృతి, ఏడుగురికి తీవ్ర గాయలయ్యాయి. ఈ ఘటన అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అబ్దుల్లా పూర్ మెట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా, జిన్నారం మండలం, వావిలాల గ్రామానికి చెందిన రాళ్లకత్వా వెంకటేశ్వర్ రెడ్డి(51) అతని కుమార్తె సౌమ్య రెడ్డి(25) హైదరాబాద్ లోని ఇన్ఫోసిస్ లో ఉద్యోగం చేస్తుంది. కాగా ఆదివారం సెలవు దినం కావడంతో ఆమె సహోద్యోగులు వీరేంద్ర(26), నంద కిషోర్, ప్రణీష్, సాగర్, అరవింద్, జాన్సీ, శృతి లు మొత్తం ఎనిమిది మంది హైదరాబాద్ శివారు రాచకొండలోని సరళ మైసమ్మ తల్లి ఆలయానికి ఇన్నోవా క్రిస్టా కారులో వెళ్లారు. వాళ్ళు దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం మండలం బొంగ్లూర్ ఉన్న ఓఆర్ఆర్ లోకి ప్రవేశించారు. కాగా ఆదివారం రాత్రి 7.30గంటల సమయంలో అబ్దుల్లాపూర్మెట్ మండలం బలిజగూడ గ్రామ పరిధిలోకి చేరుకోగానే కారును డ్రైవింగ్ చేసిన వీరేందర్ అతివేగం కారణంగా నియంత్రణ కోల్పోయి ఓఆర్ఆర్ డివైడర్ ను బలంగా ఢీ కొట్టారు. దీంతో కారు పెద్ద అంబర్ పేట సైడ్ రోడ్డు వైపు తిరిగింది. దాని ఫలితంగా, అందరికీ తీవ్ర రక్తస్రావం కావడంతో వారిని వెంటనే హయత్ నగర్ లోని సన్ రైజ్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సౌమ్యరెడ్డి, నందకిషోర్ లను మెరుగైన చికిత్స కోసం ఉప్పల్ లోని సిటీ న్యూరో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాళ్లకత్వా సౌమ్య రెడ్డి మృతి చెందింది. దీంతో ఆమె తండ్రి అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

