ఏర్పేడు మండలం ఏర్పేడు జెడ్పీ హై స్కూల్ నందు దివ్యాంగులు, వయోవృద్ధులకు ప్రభుత్వం ద్వారా ఉచిత సహాయక పరికరాలు పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పేడు టీడీపీ పార్టీ అధ్యక్షులు పేరం నాగరాజ నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ శిబిరానికి దివ్యాంగులు, వయోవృద్ధులు పెద్ద ఎత్తున హాజరై ప్రభుత్వం అందిస్తున్న పరికరాల కోసం నమోదు చేసుకోగా సంబంధిత అధికారులు దివ్యాంగుల అవసరాలను పరిశీలించి వారికి తగిన పరికరాలను అందజేయడానికి చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మార్కెట్ కమిటీ చైర్మన్ రంగినేని చెంచయ్య నాయుడు, ఉమ్మడి గ్రంథాలయ చైర్మన్ రెడ్డివారి గురువారెడ్డి, నైనూరు పున్నారావు, ఏర్పేడు ప్యాక్స్ చైర్మన్ మహేష్ రెడ్డి, ఏర్పేడు ఎంపీడీఓ సౌభాగ్యమ్మ, వైద్యులు, జీపీ రాజశేఖర్ నాయుడు, వికలాంగుల సంక్షేమ శాఖ అధికారులు, శివప్రియ, ఏర్పేడు పీహెచ్సీ సిబ్బంది, ఏర్పేడు, రేణిగుంట మండలాల సచివాలయ సిబ్బంది, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు.

ఏర్పేడులో దివ్యాంగులకు ఉచిత సహాయక పరికరాల శిబిరం
ఏర్పేడు మండలం ఏర్పేడు జెడ్పీ హై స్కూల్ నందు దివ్యాంగులు, వయోవృద్ధులకు ప్రభుత్వం ద్వారా ఉచిత సహాయక పరికరాలు పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పేడు టీడీపీ పార్టీ అధ్యక్షులు పేరం నాగరాజ నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ శిబిరానికి దివ్యాంగులు, వయోవృద్ధులు పెద్ద ఎత్తున హాజరై ప్రభుత్వం అందిస్తున్న పరికరాల కోసం నమోదు చేసుకోగా సంబంధిత అధికారులు దివ్యాంగుల అవసరాలను పరిశీలించి వారికి తగిన పరికరాలను అందజేయడానికి చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మార్కెట్ కమిటీ చైర్మన్ రంగినేని చెంచయ్య నాయుడు, ఉమ్మడి గ్రంథాలయ చైర్మన్ రెడ్డివారి గురువారెడ్డి, నైనూరు పున్నారావు, ఏర్పేడు ప్యాక్స్ చైర్మన్ మహేష్ రెడ్డి, ఏర్పేడు ఎంపీడీఓ సౌభాగ్యమ్మ, వైద్యులు, జీపీ రాజశేఖర్ నాయుడు, వికలాంగుల సంక్షేమ శాఖ అధికారులు, శివప్రియ, ఏర్పేడు పీహెచ్సీ సిబ్బంది, ఏర్పేడు, రేణిగుంట మండలాల సచివాలయ సిబ్బంది, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు.

