కేంద్రం లో మోదీ సర్కార్ కు , ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు కూటమి సర్కార్ కు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా ! అనిపిస్తుంది .
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా , విభన హామీలు సాధించి నట్టు ” జి. ఎస్.టి. ” సంబరాలు ఏమిటి ! మోదీ రాజకీయ ప్రచారం కోసం చేసిన వందల కోట్ల ఖర్చు ఆంధ్ర రాష్ట్రంలో అనేక అవసరాలు తీరతాయని గ్రహించలేరా !
మతి చెలించిన చంద్రబాబు కూటమి సర్కార్ ఆంధ్ర రాష్ట్ర వెన్నుముక ను విరిచేస్తుంది . మోదీ దృష్టిలో ఆంధ్రప్రదేశ్ లో పాలకులు లేరు పాలెగాళ్ళు మాత్రమే వున్నారు అనే అహంతో ఆంధ్రప్రదేశ్ లో మోదీ ఉపన్యాసాలు చెల్లుతున్నాయి .
ఆంధ్ర పౌరుషం లేని పాలకులు ఆంధ్రప్రదేశ్ కు అవసరమా ! అవినీతి కుంబకోణాలకు వ్యసన పరులు ఢిల్లీ పాలకులకు బానిసలు నేడు ఆంధ్రప్రదేశ్ ప్రధాన పాలకులుగా చెల్లుబాటు అవుతున్నారు . ఎన్నాళ్ళు సాగునో ఈ వైభోగం వేచి చూడాలి ..


