ఏడాదిలో లక్ష ఉద్యోగాలు ఇచ్చిన ఘనత జగన్ కే సొంతం

0
108
సచివాలయాన్ని ప్రారంభిస్తున్న మద్దిశెట్టి

ప్రకాశం జిల్లా దర్శి మండలం కొత్తపాలెంలో నూతనంగా నిర్మించిన దర్శి-2 సచివాలయాన్ని ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరితగతిన అన్ని సచివాలయాలు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. జగనన్న సారథ్యంలో ఏడాది పాలన విజయవంతంగా పూర్తి చేసుకున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏడాదిలోనే లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఒక్క జగన్​కే దక్కుతుందని కొనియాడారు. సచివాలయాలు అవినీతి రహితంగా ప్రజలకు విశ్వాసం కలిగించేలా ఉండాలని ఉద్యోగులకు సూచించారు.