మహారాష్ట్ర రాష్టం నాందేడ్ జిల్లా కందర్ తాలూకా లోని ఉంరాజ్ దాక్రె పండర్ పూర్ లోని ఏక్ నాథ్ మహరాజ్ ను మాజీ ఎంపీ, రాజ్ గోండ్ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షులు సోయం బాపూరావు దర్శించుకున్నారు. ముందుగా ఆలయానికి చేరుకున్న మాజీ ఎంపీ ను ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికి, మహరాజ్ జ్ఞాపిక ను అందజేశారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వీరి వెంట గుడిహత్నూర్ మండల పెద్దలు ఉన్నారు.


