రాయచోటి, ఆగస్టు 14:
శాంతి భద్రతల పరిరక్షణలో అంకితభావంతో చేసిన విశిష్ట సేవలకు కేంద్ర ప్రభుత్వం అందించే Police Medal for Meritorious Service కు అన్నమయ్య జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఏఎస్ఐ (2072) నాయబ్ ఉస్మాన్ ఘనీ ఖాన్ ఎంపికయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్ గారు ఘనీ ఖాన్ను అభినందించారు.
1987లో కానిస్టేబుల్గా పోలీసు సేవ ప్రారంభించిన ఘనీ ఖాన్, మదనపల్లి వన్టౌన్, మదనపల్లి తాలూకా, మొలకలచెరువు, బి.కొత్తకోట, గుడిపాల, ఎర్రావారిపాలెం, సీఐ సెల్ తదితర స్టేషన్లలో సేవలందించారు.
సర్వీస్ కాలంలో 70 నగదు రివార్డులు, 50 జి.ఎస్.ఈలను అందుకున్న ఘనీ ఖాన్, ప్రస్తుతం స్పెషల్ బ్రాంచ్లో విధులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారు.


