చిత్తూరు, జులై 23 ( పున్నమి ప్రతినిధి ) : చిత్తూరు జిల్లా కు కేటాయించబడిన 8 మంది ప్రొబేషనరి ఎస్. ఐ లు బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ కి పుష్పగుచ్ఛం ఇచ్చి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.ఎస్పీ ప్రొబేషనరీ ఎస్సైలతో మాట్లాడుతూ… ప్రజలతో మర్యాదగా ప్రవర్తించాలి, విధులను నిజాయితీగా నిర్వర్తించాలి, చట్టపరమైన అవగాహన పెంపొందించుకోవాలి, పోలీస్ డిపార్ట్మెంటుకు గౌరవం తీసుకురావాలి, ప్రజల విశ్వాసం సంపాదించాలి, బాధ్యతాయుతంగా పని చేయాలని సూచనలు చేశారు.


