Monday, 8 December 2025
  • Home  
  • ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు
- ఎలూరు

ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు

ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు ఆగిరిపల్లి: పున్నమి ప్రతినిధి మండలంలో ఎరువుల దుకాణదారులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని మండల వ్యవసాయ అధికారిని జె. భవాని హెచ్చరించారు. ఆదివారం మండలంలోని ఆగిరిపల్లి, నెక్కలం గొల్లగూడెం, కొత్త ఈదరలోని ఎరువుల దుకాణాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులకు ఎరువులను విక్రయించిన వెంటనే రసీదులు ఇవ్వాలని, ఈపాస్ మిషన్ ద్వారా ఎరువులు విక్రయాలు చేపట్టాలని, స్టాక్ వివరాలు రికార్డులు పొందుపరచాలని ఆదేశించారు. ఏయ్ మండలంలో యూరియాతోపాటు అన్ని ఎరువులు అందుబాటులో ఉన్నాయని. డీలర్లు ఎవరైనా కృత్రిమ కొరత సృష్టించాలని చూస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆమెతోపాటు తనిఖీలలో వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు
ఆగిరిపల్లి: పున్నమి ప్రతినిధి
మండలంలో ఎరువుల దుకాణదారులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని మండల వ్యవసాయ అధికారిని జె. భవాని హెచ్చరించారు. ఆదివారం మండలంలోని ఆగిరిపల్లి, నెక్కలం గొల్లగూడెం, కొత్త ఈదరలోని ఎరువుల దుకాణాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులకు ఎరువులను విక్రయించిన వెంటనే రసీదులు ఇవ్వాలని, ఈపాస్ మిషన్ ద్వారా ఎరువులు విక్రయాలు చేపట్టాలని, స్టాక్ వివరాలు రికార్డులు పొందుపరచాలని ఆదేశించారు. ఏయ్ మండలంలో యూరియాతోపాటు అన్ని ఎరువులు అందుబాటులో ఉన్నాయని. డీలర్లు ఎవరైనా కృత్రిమ కొరత సృష్టించాలని చూస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆమెతోపాటు తనిఖీలలో వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.