10 ఆంధ్ర నేవల్ యూనిట్ యన్ సి సి నెల్లూరు లెఫ్టినెంట్ కమాండర్ మరియు క్యాంపు కమాండెంట్ గణేష్ గొదంగవే ఆధ్వర్యంలో
10 ఆంధ్ర నేవల్ యూనిట్ యన్ సి సి యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్-3, 28 ఏప్రిల్ 2025 నుంచి 07 మే 2025 వరకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అక్షర విద్యాలయ నందునిర్వహింపబడుతున్నది
ఈ క్యాంపును ఉద్దేశించి క్యాంపు కమాండెంట్ గణేష్ గొదం గవే మాట్లాడుతూ కేడేట్లు ఈ శిక్షణా శిభిరంలో నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, జాతీయ సమైక్యత, సామాజిక సేవ, దేశ భక్తి, గన్ ఫైరింగ్ తదితర అంశాలపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఈ శిక్షణను మంచిగా ఉపయోగించుకుని అత్యు త్తమ పౌరులుగా ఎదిగి దేశ సేవ చేయాలని, ఎండలు ఎక్కువగా ఉన్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలని, తగినంత మంచినీరు తాగాలని క్యాడేట్లకు ఉద్భోదించారు.
ఈ క్యాంపులో ఈరోజు శారీరక వ్యాయామం, యోగ ఆసనాలు, నౌక నమూనా నిర్మాణం, వ్యక్తిత్వ వికాసం, సామాజిక అవగాహన, ప్రకృతి వైపరీత్యాలు సంభవించి నప్పుడు తీసుకోవాల్సిన నివారణ చర్యలు, సమాచార వ్యవస్థ, ఆయుధ శిక్షణ, ఆరోగ్యము మరియు పరిశుభ్రత లెక్చరర్, ఎన్సిసి గురించి అవగాహన ఉపన్యాసం, ఆటలు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ శిక్షణా కార్యక్రమంలో ఎన్సిసి అధికారులు గుండాల నరేంద్ర బాబు, మల్లికార్జున రెడ్డి, మస్తానయ్య, కొండారెడ్డి, సాయి శంకరి, పి ఐ స్టాఫ్ వైకుంఠం చీఫ్ ఇన్స్ట్రక్టర్, పెట్టీ ఆఫీసర్లు రంజన్, లోకేష్, లక్ష్మణ్, దీపక్,వెంకటేష్, రమణారావు, నవీన్, ఆఫీస్ సిబ్బంది సూపరింటెండెంట్ ముకుంద సాగర్, షిప్ మోడలింగ్ ఇన్స్ట్రక్టర్ రామన్ సీనియర్ అసిస్టెంట్లు షెహనాజ్ బేగం, కల్పన,జూనియర్ అసిస్టెంట్ సుజాత తదితరులు పాల్గొన్నారు. ఈ శిక్షణా శిభిరంలో మొత్తం 565 మంది ఎన్సిసి క్యాడెట్లు హాజరై శిక్షణ పొందుతున్నారు.