ఎన్టీఆర్ విగ్రహాష్కరణ
విశాఖపట్నం
ఆగస్టు29 పున్నమి ప్రతినిధి(వి సతీష్ కుమార్)
విశాఖపట్నం జివిఎంసి 90వార్డ్ విమాన్ నగర్, డబుల్ రోడ్ లో శుక్రవారం మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహావిష్కరణ చేసారు. విశాఖ పార్లమెంట్ సభ్యులు
భరత్, ప్రభుత్వ విప్ గణబాబులు ముఖ్య అతిథులుగా హాజరయి విమాన్ నగర్ కాలనీ వాసులు ఏర్పాటు చేసిన
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు కీ శే నందమూరి తారకరామారావు
విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ పథకాలకు ఆద్యుడు నందమూరి తారకరామరావని, ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. కూటమి పాలనలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలో రాష్ట్రం సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తున్నారన్నారు.
విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ పి గణబాబు మాట్లాడుతూ తెలుగువారి ఆరాధ్యదైవం నందమూరి తారక రామారావు అని అన్నారు. విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విమాన్ నగర్ అసోసియేషన్ సభ్యులను పేరు పేరున అభినందించారు.
ఈ కార్యక్రమంలో
90 వార్డ్ కార్పొరేటర్ బొమ్మిడీ రమణ, టీడీపీ, నాయకులు కార్యకర్తలు మహిళానాయకులు అసోసియేషన్ సబ్యులు పాల్గోన్నారు.


