కామారెడ్డి, 25 డిసెంబర్, ( పున్నమి ప్రతినిధి ) :
కామారెడ్డి జిల్లా,రామారెడ్డి మండలం, ఉప్పల్వా యి ఇక్కడేగ్రామంలో పంచాయతీ ఎన్నికల ఓటమి మహిళలను మద్యానికి మళ్లించిందా? వింత ఘట న గ్రామాన్ని ఆశ్చర్యపరిచింది. రామారెడ్డి మండ లం ఉప్పల్వాయి గ్రామంలో 2వ వార్డు మెంబర్ పోటీ చేసిన మహిళ ఓడిపోయాక ఆగ్రహం మద్యం తో బాహాట్ అయింది. ప్రతిరోజు ఉదయం ఇంటి ముందు తిట్ల తుఫాను…. అసభ్య పదాలు, భూత మాటలతో గ్రామస్తులను తొక్కుతూ, మహిళలు పంచాయతీ కార్యాలయం ముందు కల్లు ప్యాకెట్లు, బీర్ సీసాలు, చీరలు పట్టుకొని ఆందోళన చేశారు!ఈ మహిళ పోటీకి లక్షల రూపాయలు ఖర్చు చేసి ఓట్లు కొనుగోలు చేసినట్టు స్థానికులు ఆరోపిస్తున్నా రు. గెలవకపోతే కళ్లు తెరిచి, ఎవరైతే డబ్బులు పంచారో వాళ్లకు తిరిగి తిట్లు తిప్పేశారు. పోలీసు లు ప్రత్యక్షం కావడంతో చేసేదిఏమిలేక గ్రామ పంచాయతీ ఆవరణలో మద్యం బాటిల్స్తో నిరస న తెలిపి వదిలేసి వెళ్లిపోయారు.ఈ వింత దృశ్యం చూసి అందరూ ఆశ్చర్యపోయా రు. రాష్ట్ర వ్యాప్తం గా పంచాయతీ ఎన్నికల్లో ఇలాంటి విచిత్ర ఘటన లు జరుగుతున్నాయి. ఓడిపోయిన తర్వాత ఆందోళనలు, తిట్లు.. గ్రామ శాంతి భంగపడుతోంది. స్థానికులు పోలీసుల చర్య కోరుతున్నారు.


