తంబళ్లపల్లె అక్టోబర్ 17 (పున్నమి ప్రతినిధి)తంబళ్లపల్లె మండలం లోని ఉపాధి హామీ పనులు చేసుకునే లబ్ధిదారులు ఈ కేవైసీ తప్పనిసరి గా చేయించుకోవాలని ఎంపిడిఓ పట్నాయక్, ఉపాధి హామీ ఎంపిఓ అంజనప్ప కూలీలను కోరారు. శుక్రవారం మండలంలోని రేణుమాకులపల్లి, ఎద్దుల వారి పల్లి పంచాయతీలలో ఏపీవో అంజనప్పతోపాటు టెక్నికల్ అసిస్టెంట్లు, క్షేత్ర సహాయకులు ఇంటింటికి తిరిగి ఈకేవైసీ చేయించడంతోపాటు వారికి ఈ కేవైసీపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏపీవో మాట్లాడుతూ ప్రతి జాబ్ కార్డు హోల్డర్ కచ్చితంగా ఈ కేవైసీ చేయించుకోవాలని లేదంటే ఉపాధి హామీ పనుల కల్పనలో భాగస్వామ్యం ఉండదని కావున కూలీలు తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోవాలని ప్రచారం నిర్వహించారు. ఆయన వెంట ఉపాధి హామీ సిబ్బంది, కూలీలు పాల్గొన్నారు.

ఉపాధి హామీ పనులకు ఈ కేవైసీ తప్పనిసరి ఏపీవో అంజనప్ప
తంబళ్లపల్లె అక్టోబర్ 17 (పున్నమి ప్రతినిధి)తంబళ్లపల్లె మండలం లోని ఉపాధి హామీ పనులు చేసుకునే లబ్ధిదారులు ఈ కేవైసీ తప్పనిసరి గా చేయించుకోవాలని ఎంపిడిఓ పట్నాయక్, ఉపాధి హామీ ఎంపిఓ అంజనప్ప కూలీలను కోరారు. శుక్రవారం మండలంలోని రేణుమాకులపల్లి, ఎద్దుల వారి పల్లి పంచాయతీలలో ఏపీవో అంజనప్పతోపాటు టెక్నికల్ అసిస్టెంట్లు, క్షేత్ర సహాయకులు ఇంటింటికి తిరిగి ఈకేవైసీ చేయించడంతోపాటు వారికి ఈ కేవైసీపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏపీవో మాట్లాడుతూ ప్రతి జాబ్ కార్డు హోల్డర్ కచ్చితంగా ఈ కేవైసీ చేయించుకోవాలని లేదంటే ఉపాధి హామీ పనుల కల్పనలో భాగస్వామ్యం ఉండదని కావున కూలీలు తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోవాలని ప్రచారం నిర్వహించారు. ఆయన వెంట ఉపాధి హామీ సిబ్బంది, కూలీలు పాల్గొన్నారు.

