గౌరవ అతిథులుగా హాజరైన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు..
వర్షాన్ని సైతం లెక్కచేయక భూమి పూజ మహోత్సవంలో పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు..!
వింజమూరు మండలం గుండెమడకల గ్రామంలో శ్రీవారి నిధులతో కోటి రూపాయల వ్యయంతో శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయానికి భూమి పూజ ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. వేదమంత్రాల మధ్య భక్తులు, గ్రామస్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ, ఆలయ నిర్మాణం గ్రామానికి ఆధ్యాత్మిక శోభను తెస్తుందని తెలిపారు.
మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ, ఆలయ నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తానని, ధూపదీప నైవేద్యం కోసం కూడా శ్రీవారి ట్రస్ట్ ద్వారా నిధులు కేటాయిస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామి రెడ్డి, అంకినపల్లి ఓబుల్ రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు.


