నెల్లూరు జిల్లా :
ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే, నాలుగు సార్లు శాసనసభ్యుడిగా సేవలందించిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సతీమణి మేకపాటి శాంతి కుమారిను నెల్లూరుజిల్లా గ్రంథాలయం చైర్మన్గా ప్రభుత్వం నియమించింది. ఈ నిర్ణయంతో ఉదయగిరి నియోజకవర్గంలో సంతోషం వ్యక్తమవుతోంది.
మేకపాటి కుటుంబం ప్రాంతీయంగా ప్రజాసేవకు చేసిన కృషిని గుర్తిస్తూ వచ్చిన ఈ నియామకాన్ని స్థానిక నాయకులు, టిడిపి కార్యకర్తలు స్వాగతిస్తున్నారు. ప్రజలతో మమేకమై పనిచేసే నాయకత్వం ఉన్న కుటుంబానికి గ్రంథాలయం చైర్మన్ పదవి దక్కడం ఉత్తేజకరంగా ఉందని అభిప్రాయపడుతున్నారు.
జిల్లా స్థాయిలో గ్రంథాలయాల అభివృద్ధి, పఠన సంస్కృతిని పెంపొందించడంలో శాంతి కుమారి నాయకత్వం ఉపయోగపడుతుందని నాయకులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.


