ఉత్తర నియోజకవర్గం 50వ వార్డు అధ్యక్షులు సనపల వరప్రసాద్ ఆధ్వర్యంలో సాయిరాం నగర్, సత్యనగర్ ప్రాంతాల్లో గత మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న రహదారి సమస్యపై ఈరోజు ప్రజా ప్రతినిధులు ప్రత్యక్షంగా స్పందించారు.
ఉత్తర నియోజకవర్గం శాసన సభ్యుడు పెనుమత్స కుమార్ రాజు గారు, విశాఖ నగరాభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రణవ గోపాల్ గారు స్వయంగా ప్రాంతాన్ని సందర్శించి సమస్య పరిష్కారానికి అవసరమైన సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ మన్యపురి శ్రీనివాసరావు, వార్డు అధ్యక్షులు వెంకటరావు, సనపల రామకృష్ణ, మాజీ కార్పొరేటర్ ఎడ్ల మర్యాదస్, బంగారయ్య, శేఖర్, కూర్మా రావు, స్థానిక నాయకులు రామారావు మరియు నగరాభివృద్ధి శాఖ ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
ప్రజల దీర్ఘకాల స్వప్నమైన రహదారి సమస్య త్వరలోనే పరిష్కారమవుతుందన్న నమ్మకాన్ని ప్రజల్లో కలిగించారు.


