ఆగస్టు 21 పున్నమి ప్రతినిధి :
స్త్రీ శక్తి పథకంలో భాగంగా మహిళలకు అతి త్వరలోనే క్యూఆర్ కోడ్తో కూడిన స్మార్ట్ కార్డులు అందిస్తామని మని ఆర్టీసీ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరు మలరావు తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలోని ఆర్టీసీ డిపోను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఇప్పటికే రోజుకు 18 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని, ఈ సంఖ్య రాబోయే రోజుల్లో 26 లక్షలకు పెరుగుతుందని అంచనా వేశారు. ఉచిత బస్సు పథకం కారణంగా ఆర్టీసీ ఆదాయానికి గండి పడకుండా ప్రభుత్వమే భరి స్తుందని ఎండీ తెలిపారు.


