*ఈ నెల 09న డీఆర్సీ సమావేశం*
@అధికారులు పక్కా నివేదికలతో హాజరు కావాలి: జిల్లా కలెక్టర్
*విశాఖపట్నం డిసెంబర్ 5 పున్నమి ప్రతినిధి:- * ఈ నెల 09న జిల్లా సమీక్షా సమావేశం (డీఆర్సీ) నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు పక్కా నివేదికలతో హాజరు కావాలని అధికారులను ఆదేశించారు. అన్ని అంశాలపై అవగాహన కలిగి ఉండాలని, గతంలో చర్చించిన సమస్యలకు తీసుకున్న పరిష్కార చర్యలను తెలుపుతూ నివేదికలు తీసుకురావాలని సూచించారు. ప్రజా ప్రతినిధులు అడిగే ప్రశ్నకు సూటిగా సమాధానం ఇచ్చేలా సన్నద్ధమై ఉండాలన్నారు. సోమవారం కలెక్టరేట్ మీటింగు హాలులో జరిగిన పీజీఆర్ఎస్ లో ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వైద్యారోగ్య శాఖ, ప్రాథమిక రంగాలు, రెవెన్యూ, జీవీఎంసీ, వీఎంఆర్డీఏ పరిధిలో చేపట్టిన ప్రాజెక్టులు, చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలను స్పష్టంగా పొందుపర్చాలని సూచించారు. ప్రజా సమస్యలకు, అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు.


