


విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భీమవరంలో ఉత్తమ ప్రతిభకనబరిచి పిన్నింటిపేట గ్రామానికి చెందిన సిహెచ్.మహేష్ గ్రాడ్యుయేట్ పట్టాను, శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ, వైస్ చైర్మన్ ఆర్.రవిచంద్రన్ చేతులమీదుగా సోమవారం అందుకున్నారు.
ఈ సందర్భంగా సిహెచ్.మహేష్ తల్లితండ్రులు సిహెచ్. వల్లభ రావు, రాజేశ్వరిలు ఒక ప్రకటనలో మాట్లాడుతూ మహేష్ చిన్ననాటి నుండే కష్టపడే తత్వమని, చదువులో ఎప్పుడూ ముందుండేవాడన్నారు.
ఈ రోజు కంప్యూటర్ సైన్స్ లో, అత్యుత్తమ ప్రతిభకనబరిచి గ్రాడ్యుయేషన్ పట్టాను అందుకొని కళాశాలకు, తల్లితండ్రులకు మంచి పేరు తెచ్చాడని, ఇష్టపడి, కష్టపడే తత్వంతో చదివితే ఉన్నతశిఖరాలను చేరుకోవచ్చని బాగోద్వేగంతో తెలిపారు.

