Saturday, 19 July 2025
  • Home  
  • ఆలయ అభివృద్దికి కృషి చేయండి ` ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి.
- Featured

ఆలయ అభివృద్దికి కృషి చేయండి ` ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి.

(పున్నమి పత్రినిధి, విడవలూరు) నూతనంగా ఎన్నికైన ఛైర్మన్‌ సభ్యులు రామతీర్థంలో వెలసియున్న కామాక్షిదేవి సమేత రామలింగేశ్వరస్వామి ఆలయాభివృద్ధికి కృషి చేయాలని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి కోరారు. రామతీర్థంలోని రామలింగేశ్వరస్వామి ఆలయ పాలక మండలి సభ్యుల పమ్రాణస్వీకారం కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఆయన మాట్లాడుతూ జొన్నవాడ దేవస్థాన ఛైర్మన్‌గా ప్రమాణస్వీకారం చేసిన రోజే పుట్టా సుబ్రహ్మణ్యం నాయుడు రూ.5.5 కోట్ల విరాళాలను దాతల నుంచి తీసుకొచ్చారన్నారు. దాతల సహకారం చాలా అవసరమన్నారు. అవసరమైతే తాను వచ్చి విరాళాలు సేకరిస్తానన్నారు. అనంతరం పాలక మండలి ఛైర్మన్‌గా నాటారు చంద్రయ్య, సభ్యులుగా రమేష్‌, పసుపులేటి సుబ్బారావు, కటారి మల్లీశ్వరి, వెంకటశేషమ్మ, నాగమణి, వేణుగోపాల్‌, శ్రీకాంత్‌శర్మ ప్రమాణ స్వీకారం చేశారు. ఆప్కాఫ్‌ ఛైర్మన్‌ కొండూరు అనీల్‌ బాబు, డీసీఎంఎస్‌ ఛైర్మన్‌ వీరి చలపతిరావు, డీఎల్‌డీఏ ఛైర్మన్‌ గొల్లపల్లి విజయ్‌కుమార్‌, బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయితీ ఛైర్‌ పర్సన్‌ సుప్రజ, పుట్టా సుబ్రమణ్యంనాయుడు, జడ్పీటీసీ తుమ్మల లక్ష్మయ్య, ఎంపీపీ భవానమ్మ, సర్పంచ్‌ సుప్రజ, ఎంపీటీసీ రమణమ్మ ఆవుల వాసు పాల్గొన్నారు.

(పున్నమి పత్రినిధి, విడవలూరు)
నూతనంగా ఎన్నికైన ఛైర్మన్‌ సభ్యులు రామతీర్థంలో వెలసియున్న కామాక్షిదేవి సమేత రామలింగేశ్వరస్వామి ఆలయాభివృద్ధికి కృషి చేయాలని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి కోరారు. రామతీర్థంలోని రామలింగేశ్వరస్వామి ఆలయ పాలక మండలి సభ్యుల పమ్రాణస్వీకారం కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఆయన మాట్లాడుతూ జొన్నవాడ దేవస్థాన ఛైర్మన్‌గా ప్రమాణస్వీకారం చేసిన రోజే పుట్టా సుబ్రహ్మణ్యం నాయుడు రూ.5.5 కోట్ల విరాళాలను దాతల నుంచి తీసుకొచ్చారన్నారు. దాతల సహకారం చాలా అవసరమన్నారు. అవసరమైతే తాను వచ్చి విరాళాలు సేకరిస్తానన్నారు. అనంతరం పాలక మండలి ఛైర్మన్‌గా నాటారు చంద్రయ్య, సభ్యులుగా రమేష్‌, పసుపులేటి సుబ్బారావు, కటారి మల్లీశ్వరి, వెంకటశేషమ్మ, నాగమణి, వేణుగోపాల్‌, శ్రీకాంత్‌శర్మ ప్రమాణ స్వీకారం చేశారు. ఆప్కాఫ్‌ ఛైర్మన్‌ కొండూరు అనీల్‌ బాబు, డీసీఎంఎస్‌ ఛైర్మన్‌ వీరి చలపతిరావు, డీఎల్‌డీఏ ఛైర్మన్‌ గొల్లపల్లి విజయ్‌కుమార్‌, బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయితీ ఛైర్‌ పర్సన్‌ సుప్రజ, పుట్టా సుబ్రమణ్యంనాయుడు, జడ్పీటీసీ తుమ్మల లక్ష్మయ్య, ఎంపీపీ భవానమ్మ, సర్పంచ్‌ సుప్రజ, ఎంపీటీసీ రమణమ్మ ఆవుల వాసు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.