Friday, 13 February 2026
  • Home  
  • ఆది దంపతుల గిరి ప్రదక్షిణకు నూతన శోభ-వర్చువల్‌గా ప్రారంభించిన పవన్ కళ్యాణ్
- తిరుపతి

ఆది దంపతుల గిరి ప్రదక్షిణకు నూతన శోభ-వర్చువల్‌గా ప్రారంభించిన పవన్ కళ్యాణ్

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 13: దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తి క్షేత్రంలో భక్తుల కల నెరవేరింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా, కైలాసగిరి చుట్టూ భక్తులు ప్రదక్షిణ చేసేందుకు వీలుగా సుమారు ₹10 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన గిరి ప్రదక్షిణ రోడ్డును శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిని పవన్ కళ్యాణ్ ని మర్యాదపూర్వకంగా కలసి అయన చేతుల మీదుగా వర్చువల్‌గా ప్రారంభింజేయడం జరిగినది. ఉప ముఖ్యమంత్రి అమరావతి నుండి వర్చువల్ విధానంలో శిలాఫలకాన్ని ఆవిష్కరించి భక్తులకు ఈ మార్గాన్ని అంకితం చేశారు. శ్రీకాళహస్తిలో ఏటా రెండుసార్లు జరిగే గిరి ప్రదక్షిణలో కొండచుట్టు లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. గతంలో ఉన్న ఇబ్బందులను తొలగిస్తూ, భక్తుల సౌకర్యార్థం ఈ 22 కిలోమీటర్ల మార్గాన్ని ఆధునీకరించారు. ఈ నూతన రోడ్డు వల్ల శివరాత్రి బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తులకు గిరి ప్రదక్షిణ సులభతరం కానుంది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ హరి ప్రసాద్, మాజీ చైర్మన్ కోలా ఆనంద్‌, మార్కెట్ కమిటి చైర్మన్ రంగినేని చెంచయ్య నాయడు, పాలక మండలి సభ్యులు, కూటమి నాయకులు, జనసేన శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 13: దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తి క్షేత్రంలో భక్తుల కల నెరవేరింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా, కైలాసగిరి చుట్టూ భక్తులు ప్రదక్షిణ చేసేందుకు వీలుగా సుమారు ₹10 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన గిరి ప్రదక్షిణ రోడ్డును శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిని పవన్ కళ్యాణ్ ని మర్యాదపూర్వకంగా కలసి అయన చేతుల మీదుగా వర్చువల్‌గా ప్రారంభింజేయడం జరిగినది. ఉప ముఖ్యమంత్రి అమరావతి నుండి వర్చువల్ విధానంలో శిలాఫలకాన్ని ఆవిష్కరించి భక్తులకు ఈ మార్గాన్ని అంకితం చేశారు. శ్రీకాళహస్తిలో ఏటా రెండుసార్లు జరిగే గిరి ప్రదక్షిణలో కొండచుట్టు లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. గతంలో ఉన్న ఇబ్బందులను తొలగిస్తూ, భక్తుల సౌకర్యార్థం ఈ 22 కిలోమీటర్ల మార్గాన్ని ఆధునీకరించారు. ఈ నూతన రోడ్డు వల్ల శివరాత్రి బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తులకు గిరి ప్రదక్షిణ సులభతరం కానుంది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ హరి ప్రసాద్, మాజీ చైర్మన్ కోలా ఆనంద్‌, మార్కెట్ కమిటి చైర్మన్ రంగినేని చెంచయ్య నాయడు, పాలక మండలి సభ్యులు, కూటమి నాయకులు, జనసేన శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.