రాధాకృష్ణ ప్రభుత్వ ఉన్నత పాఠశాల చాకలకొండ నందు పాత,కొత్త ఉపాధ్యాయుని, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ పాఠశాల నందు గత కొన్ని సంవత్సరాలుగా బాధ్యతలు నిర్వహించి బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు, మరియు బదిలీ పై ఈ పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయునికి మరియు ప్రమోషన్ పై వివిధ పాఠశాలకు వెళ్లిన ఉపాధ్యాయులకు, మరియు ఇదే పాఠశాలలో పనిచేస్తూ మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయిని అవార్డు అందుకున్న ఉపాధ్యాయునికి, ఇదే పాఠశాలలో ప్రమోషన్ పొందిన వ్యాయామ ఉపాధ్యాయునికి మరియు నూతనంగా 2025 DSC ఉపాధ్యాయ ఉద్యోగం పొందిన ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులకు, మరియు ఎంఆర్సి సిబ్బందికి, ఆత్మీయ సమావేశం ఘన మరియు సన్మానం ప్రధానోపాధ్యాయులు P. రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. పై కార్యక్రమంలో MEO – 1 పి.రమేష్, ఏ. సుభాషిని, ఎస్ తులసీరామ్ రెడ్డి, సమీరా బేగం, ప్రతాప్, నరేష్, మస్తానయ్య, వెంకటేశ్వర్లు, మము లాభి, లక్ష్మీ ప్రసన్న, లక్ష్మయ్య, మహేష్, మోహన్ రావు, సూరా రామిరెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు వెలుగోటి కృష్ణ, ఎమ్మార్సీ సిబ్బంది మౌనిక రెడ్డి, ధర్మారెడ్డి హజరత్ రెడ్డి,జలీల్ పాల్గొన్నారు


