శ్రీకాళహస్తి తెలుదేశం పార్టీనాయకులు, కూటమి నాయకులు కలసి బుధవారం నాడు అర్ధనారీశ్వరాలయాన్ని శుద్ధిపరిచేసారు. శ్రీకాళహస్తి దేవస్థానం అనుసంధానమైన అర్ధనారీశ్వరీ స్వామి ఆలయం నందు మంగళవారం రోజు రాత్రి మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆలయం దర్శనానికి వెళ్లిన సందర్భంలో ఆలయం వద్ద నీరు ఉండడం కరెంటు లేకపోవడంతో కార్తీక మాసంలో భక్తులు ఇక్కడ కార్తిక దీపాలను వెలిగించుకోవడానికి వస్తారని ఇక్కడ విద్యుత్తు లేకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేసినట్టు డ్రామాలు చేస్తూ దేవాలయ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నటువంటి ఈవో బాపిరెడ్డిని విమర్శించడం తగదని అనవసరంగా విమర్శిస్తే సహించేది లేదని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆలయం వద్ద గోమూత్రం, పసుపు నీళ్లతో శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ….మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా అర్ధనారీశ్వరుని ఆలయం వద్ద మాట్లాడడం హేయమైనచర్య అతని రాకతో ఈ ఆలయం అశుద్ధి అయ్యిందని కాబట్టి తెలుగుదేశం నాయకులు గోమూత్రం, పసుపునిలతో శుద్ధి చేపట్టామన్నారు. అర్ధనారీశ్వరుని ఆలయాన్ని తానే నిర్మించానని బియ్యపు మధుసూదన్ రెడ్డి చెప్పడం కడు విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నో తరాల నుంచి ఈ ఆలయం ఇక్కడ నిర్మింపబడి ఉందని మాజీ శాసనసభ్యులు బియ్యపు మసూదన్ రెడ్డికి గుర్తు చేశారు. ఈ ఆలయం పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇసుక గత ప్రభుత్వంలో మాజీ శాసనసభ్యులు దోచుకున్న విషయాన్ని మరిచిపోయారా అంటూ వారు గుర్తు చేశారు. మరో మారు భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడితే తెలుగుదేశం పార్టీ నాయకులు చూస్తూ ఊరుకోమని తగ్గిన విధంగా బుద్ధి చెబుతామన్నారు. ఈ కార్యక్రమం లో కూటమి నాయకులు కార్యకర్తలు, ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు.

అర్ధనారీశ్వరాలయాన్ని శుద్ధిపరిచిన టిడిపి నాయకులు
శ్రీకాళహస్తి తెలుదేశం పార్టీనాయకులు, కూటమి నాయకులు కలసి బుధవారం నాడు అర్ధనారీశ్వరాలయాన్ని శుద్ధిపరిచేసారు. శ్రీకాళహస్తి దేవస్థానం అనుసంధానమైన అర్ధనారీశ్వరీ స్వామి ఆలయం నందు మంగళవారం రోజు రాత్రి మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆలయం దర్శనానికి వెళ్లిన సందర్భంలో ఆలయం వద్ద నీరు ఉండడం కరెంటు లేకపోవడంతో కార్తీక మాసంలో భక్తులు ఇక్కడ కార్తిక దీపాలను వెలిగించుకోవడానికి వస్తారని ఇక్కడ విద్యుత్తు లేకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేసినట్టు డ్రామాలు చేస్తూ దేవాలయ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నటువంటి ఈవో బాపిరెడ్డిని విమర్శించడం తగదని అనవసరంగా విమర్శిస్తే సహించేది లేదని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆలయం వద్ద గోమూత్రం, పసుపు నీళ్లతో శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ….మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా అర్ధనారీశ్వరుని ఆలయం వద్ద మాట్లాడడం హేయమైనచర్య అతని రాకతో ఈ ఆలయం అశుద్ధి అయ్యిందని కాబట్టి తెలుగుదేశం నాయకులు గోమూత్రం, పసుపునిలతో శుద్ధి చేపట్టామన్నారు. అర్ధనారీశ్వరుని ఆలయాన్ని తానే నిర్మించానని బియ్యపు మధుసూదన్ రెడ్డి చెప్పడం కడు విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నో తరాల నుంచి ఈ ఆలయం ఇక్కడ నిర్మింపబడి ఉందని మాజీ శాసనసభ్యులు బియ్యపు మసూదన్ రెడ్డికి గుర్తు చేశారు. ఈ ఆలయం పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇసుక గత ప్రభుత్వంలో మాజీ శాసనసభ్యులు దోచుకున్న విషయాన్ని మరిచిపోయారా అంటూ వారు గుర్తు చేశారు. మరో మారు భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడితే తెలుగుదేశం పార్టీ నాయకులు చూస్తూ ఊరుకోమని తగ్గిన విధంగా బుద్ధి చెబుతామన్నారు. ఈ కార్యక్రమం లో కూటమి నాయకులు కార్యకర్తలు, ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు.

