శ్రీకాళహస్తి, మార్చి 15 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి మండలంలోని అమ్మపాలెం గ్రామానికి చెందిన వెంకట సుబ్బారెడ్డి ఇటీవల ఆకస్మికంగా మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి వారి ఇంటికి చేరుకుని సుబ్బారెడ్డి కర్మక్రియల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకట సుబ్బారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ విషాద సమయంలో తాము వారి కుటుంబానికి అండగా ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యుగంధర్ రెడ్డి, రాజేష్ రెడ్డి, శివ రెడ్డి, శంకరయ్య, చంద్ర రెడ్డి, సుమన్, మాధవ, మధు రెడ్డి, శ్రవణ్ రెడ్డి, హరి రెడ్డి తదితరులు పాల్గొని వెంకట సుబ్బారెడ్డికి నివాళులు అర్పించారు.

అమ్మపాలెం వాసి వెంకట సుబ్బారెడ్డి మృతిపై మాజీ ఎమ్మెల్యే సంతాపం
శ్రీకాళహస్తి, మార్చి 15 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి మండలంలోని అమ్మపాలెం గ్రామానికి చెందిన వెంకట సుబ్బారెడ్డి ఇటీవల ఆకస్మికంగా మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి వారి ఇంటికి చేరుకుని సుబ్బారెడ్డి కర్మక్రియల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకట సుబ్బారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ విషాద సమయంలో తాము వారి కుటుంబానికి అండగా ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యుగంధర్ రెడ్డి, రాజేష్ రెడ్డి, శివ రెడ్డి, శంకరయ్య, చంద్ర రెడ్డి, సుమన్, మాధవ, మధు రెడ్డి, శ్రవణ్ రెడ్డి, హరి రెడ్డి తదితరులు పాల్గొని వెంకట సుబ్బారెడ్డికి నివాళులు అర్పించారు.

