అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి
ఆగిరిపల్లి: పున్నమి ప్రతినిధి
మండల కేంద్రమైన ఆగిరిపల్లి లో మంత్రి కొలుసు పార్థసారథి సోమవారం పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఆగిరిపల్లి లో గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు హయంలోరూ.42 లక్షలతో నిర్మించిన సచివాలయాన్ని మంత్రి ప్రారంభించారు. స్థానిక హరిజనవాడలో రూ.45 లక్షలతో నిర్మించిన వాటర్ ట్యాంకును, రూ.17 లక్షలతో నిర్మించిన సిసి రోడ్డును ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పేదరికాన్ని రూపుమాపేందుకు మార్గదర్శకులు సహకారంతో పి -4అమలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పలు అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి
అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి ఆగిరిపల్లి: పున్నమి ప్రతినిధి మండల కేంద్రమైన ఆగిరిపల్లి లో మంత్రి కొలుసు పార్థసారథి సోమవారం పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఆగిరిపల్లి లో గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు హయంలోరూ.42 లక్షలతో నిర్మించిన సచివాలయాన్ని మంత్రి ప్రారంభించారు. స్థానిక హరిజనవాడలో రూ.45 లక్షలతో నిర్మించిన వాటర్ ట్యాంకును, రూ.17 లక్షలతో నిర్మించిన సిసి రోడ్డును ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పేదరికాన్ని రూపుమాపేందుకు మార్గదర్శకులు సహకారంతో పి -4అమలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పలు అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

