నెల్లూరు డిసెంబర్ (— పున్నమి ప్రతినిధి)
నెల్లూరు సిటీ 16వ డివిజన్ గుర్రాల మడుగు సంఘం వద్ద రోడ్ల పనులపై స్థానికుల అభ్యంతరాలను జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ పరిశీలించి సమన్వయం చేశారు. అభివృద్ధిలో పక్షపాతం ఉండదని, ప్రజలందరూ అధికారులకు సహకరించాలని కోరారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డీఎస్సీ, పోలీస్ ఉద్యోగాలు రావడం మంచి పాలనకు నిదర్శనమన్నారు. సీఎం నారా చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి పొంగూరు నారాయణల నాయకత్వంలో అభివృద్ధి వేగంగా జరుగుతోందని తెలిపారు.


