భీమవరం : అన్నిదానాలకెల్ల అన్నదానం ఎంతో గొప్పదని, దైవ కార్యక్రమాల్లో అన్న సమారాధనలు భగవంతుడు మెచ్చే కార్యక్రమమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. భీమవరం మండలం రాయలం గ్రామంలో 3వ వార్షిక శ్రీదేవి శరన్నవరాత్రుల మహోత్సవంలో భాగంగా మంగళవారం రాయలం గణేష్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్న సమారాధన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. ముందుగా అమ్మవారిని దర్శించుకుని మహా నివేదనకు హారతులు ఇచ్చారు. వందలాది మంది భక్తులు అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో టౌన్ హాల్ అధ్యక్షులు కోళ్ల రామచంద్రరావు, యూత్ సభ్యులు రామదుర్గ, పవన్, కేశవ, నందు, గౌతమ్, సాయి, వీర భక్తులు పాల్గొన్నారు.

అన్నిదానాలకెల్ల అన్నదానం ఎంతో గొప్పది
భీమవరం : అన్నిదానాలకెల్ల అన్నదానం ఎంతో గొప్పదని, దైవ కార్యక్రమాల్లో అన్న సమారాధనలు భగవంతుడు మెచ్చే కార్యక్రమమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. భీమవరం మండలం రాయలం గ్రామంలో 3వ వార్షిక శ్రీదేవి శరన్నవరాత్రుల మహోత్సవంలో భాగంగా మంగళవారం రాయలం గణేష్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్న సమారాధన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. ముందుగా అమ్మవారిని దర్శించుకుని మహా నివేదనకు హారతులు ఇచ్చారు. వందలాది మంది భక్తులు అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో టౌన్ హాల్ అధ్యక్షులు కోళ్ల రామచంద్రరావు, యూత్ సభ్యులు రామదుర్గ, పవన్, కేశవ, నందు, గౌతమ్, సాయి, వీర భక్తులు పాల్గొన్నారు.

