సీతారామపురం సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి)
రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరతకు నిరసనగా ఈనెల 9 వ తేదీన అన్ని కలెక్టరేట్ లు, ఆర్డిఓ కేంద్రాల వద్ద వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో చేపట్టనున్న అన్నదాత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీతారామపురం మండల వైసీపీ సీనియర్ నాయకుడు పిసి. అల్లూరు రాజు, నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సిపి యూత్ వింగ్ జాయింట్ సెక్రటరీ పాలగిరి ముద్దుకృష్ణమరాజు లు పేర్కొన్నారు. ఆదివారం సీతారామపురంలో అన్నదాత పోరు పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసిపి కేంద్ర కార్యాలయం ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి, ఉదయగిరి నియోజకవర్గం సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి ల పిలుపుమేరకు సీతారామపురం మండలంలోని వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పార్టీల కతీతంగా రైతులు అన్నదాత పోరు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు కటారి శ్రీనివాసులు, ఏనుగుల రూపేష్, సరస్వతి నారాయణ రాజు, పిడుగు నవీన్, పాలగిరి నవీన్ తదితరులు పాల్గొన్నారు.


