అనకాపల్లి, అక్టోబర్ 25
పున్నమి ప్రతినిధి :
వాతావరణ శాఖ ప్రకటించిన ‘మంత’ తుఫాను హెచ్చరిక నేపథ్యంలో ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణ కోసం అనకాపల్లి జిల్లా పోలీసులు అన్ని రకాల ముందస్తు చర్యలను ప్రారంభించారు. ప్రజల భద్రతకై జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
ఎస్పీ గారి ఆదేశాల మేరకు అన్ని పోలీస్ స్టేషన్ అధికారులు స్థానిక తహసీల్దార్లు, రెవెన్యూ, మత్స్య, పంచాయతీ అధికారులు మరియు జిల్లా యంత్రాంగంతో సమన్వయం కొనసాగిస్తూ తగిన జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. తీరప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాట్లు చేశారు.
ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా గారు ప్రజలకు మరియు పర్యాటకులకు జాగ్రత్త సూచనలు జారీ చేశారు.
1️⃣ తీరప్రాంతాలకు రేపటినుంచి తదుపరి ఆదేశాలు వెలువడే వరకు వెళ్లరాదు.
2️⃣ మత్స్యకారులు తాత్కాలికంగా వేటకు వెళ్లరాదు.
3️⃣ పోలీస్ అధికారులు జిల్లా యంత్రాంగంతో నిరంతర సమన్వయం కొనసాగించాలి.
4️⃣ అత్యవసర అవసరం లేకుండా ప్రజలు బయటకు వెళ్లరాదు.
5️⃣ స్థానిక అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని, రూమర్లు లేదా తప్పుడు సమాచారం నమ్మరాదని విజ్ఞప్తి చేశారు.
ఎస్పీ గారు తెలిపారు—“అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. తుఫాను సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి, ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు సమీప పోలీస్ స్టేషన్ లేదా 112 నంబర్ ద్వారా వెంటనే సమాచారం ఇవ్వాలి” అని సూచించారు.


