ఎమ్మిగనూరు నియోజకవర్గం,గోనెగండ్ల మండలం అక్టోబర్ 30(పున్నమి ప్రతినిధి)
బుధవారం అగ్నిప్రమాదం జరిగిన ఎమ్మిగనూరు మార్కెట్ యార్డులోని గోనె సంచుల దుకాణాన్ని ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి సందర్శించారు. మార్కెట్ యర్డు చైర్మన్ మల్లయ్య మరియు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ లు ఇతర ప్రతినిధులతో కలిసి ఘటనాస్థలిని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను ఆరా తీశారు. ఈ సందర్భంగా బాధితులను పరామర్శించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారు.


