ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి (పున్నమి ప్రతినిధి) .నెల్లూరు జిల్లా మనుబోలు మండలం అక్కంపేట గ్రామంలో సర్వే నం.103లోని 3.75 ఎకరాల భూమి జగనన్న లేఔట్గా కేటాయించినప్పటికీ, గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి కారణంగా పేదలకు ఇళ్ల పట్టాలు అందలేదని గ్రామస్తులు ఆరోపించారు. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. ఎమ్మెల్యే సంబంధిత అధికారులను పిలిచి తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకొని పేదలకు వెంటనే పట్టాలు పంపిణీ చేయాలని ఆదేశించారు. అధికారులు త్వరలోనే సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

అక్కంపేట జగనన్న లేఔట్లో అవినీతి—పట్టాల పంపిణీకి ఎమ్మెల్యే ఆదేశం
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి (పున్నమి ప్రతినిధి) .నెల్లూరు జిల్లా మనుబోలు మండలం అక్కంపేట గ్రామంలో సర్వే నం.103లోని 3.75 ఎకరాల భూమి జగనన్న లేఔట్గా కేటాయించినప్పటికీ, గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి కారణంగా పేదలకు ఇళ్ల పట్టాలు అందలేదని గ్రామస్తులు ఆరోపించారు. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. ఎమ్మెల్యే సంబంధిత అధికారులను పిలిచి తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకొని పేదలకు వెంటనే పట్టాలు పంపిణీ చేయాలని ఆదేశించారు. అధికారులు త్వరలోనే సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

