ఖమ్మం అక్టోబర్
(పున్నమి ప్రతి నిధి)
ఖమ్మం జిల్లా ఖానాపురం హవెలి పోలీసులు సంచలన అరెస్టు చేశారు. చోరీ కేసుల్లో ఇప్పటికే అరెస్టయ్యి బెయిల్పై వచ్చిన నిందితుడు మిక్కిలి వంశీకృష్ణ అలియాస్ శామ్ రిచర్డ్, మళ్లీ తన పాత అలవాట్లకు వెళ్లిపోయాడు. హైదరాబాద్, బెంగళూరు, గోవా నగరాల్లోని స్టార్ హోటళ్లలో విలాసవంతమైన జీవితం గడుపుతూ అక్కడివారిపై కన్నేశాడు.
పోలీసుల ప్రకారం, వంశీకృష్ణ మళ్లీ పలు చోరీలకు పాల్పడి, 66 లక్షల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలు మరియు ఒక కారుతో సహా పట్టుబడ్డాడు. ఖానాపురం హవెలి పోలీసులు అతడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసులో మరిన్ని వివరాలు వెల్లడించిన ఏసీపీ రమణమూర్తి, నిందితుడి ఆడంబరమైన జీవితం ప్రజలను మోసం చేయడానికి ఉపయోగపడిందని తెలిపారు.


