భారత రాష్ట్ర సమితి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు తోట ఆగన్న గారు హోలీ పండుగ సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నిర్వహించిన రంగుల సంబరాల్లో పాల్గొన్నారు. ప్రజలతో కలిసి రంగులు చల్లుకుంటూ ఆనందంగా హోలీ వేడుకలు జరుపుకుని శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హోలీ పండుగ సమాజంలో సౌహార్దం, ఐక్యత, సోదరభావానికి ప్రతీక అని పేర్కొన్నారు. ప్రతి ఇంట్లో ఆనందాలు, సంతోషాలు నిండాలని, ప్రజల జీవితం రంగుల మయంగా ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



