పున్నమి న్యూస్ (కోనసీమ) సీనియర్ జర్నలిస్ట్ రమణ: రాయవరం మండలం సోమేశ్వరం గ్రామం, రెడ్డి కృష్ణమ్మ పేట లో వేయించేసి వున్న శ్రీ గోవింద మాంబా సమేత శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి పార్వతీ పరమేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీ దేవి నవరాత్రుల 8వ రోజు సరస్వతి దేవి అవతారం మూల నక్షత్రం సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు తో అమ్మవారి సరస్వతి పూజ ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో సుమారుగా 500 మంది విద్యార్థులు హాజరు కావడం విశేషం. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతీ సంవత్సరం సరస్వతి అమ్మ వారి పూజ గణంగా జరుగుతుంది అని వివరించారు., అలాగే పిల్లలు అందరికీ కమిటీ వారు పాలు, కోవా, వాటర్ బాటిల్, ఎగ్జామ్ ప్యాడ్ లు, పుస్తకాలు, స్కెచ్ లు, బాక్స్ లు, ఎక్కాల పుస్తకాలు. అమ్మవారి ఫోటోలు, తీర్థ ప్రసాదాలు తో పిల్లలను ఆశీర్వదించడం జరిగింది.


