ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంలో 20 మరియు 21-11-2025 తేదీలలో రెండు రోజులపాటు సంయుక్త తీర భద్రతా వ్యాయామం “సాగర కవచ్-02/2025” నిర్వహణ.
*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి*
ఆంధ్రప్రదేశ్ తీరప్రాంత వ్యాప్తంగా రెండు రోజులపాటు (20 & 21-11-2025) “సాగర కవచ్-02/2025” సంయుక్త తీర భద్రతా వ్యాయామం కోస్ట్ గార్డ్స్ జిల్లా ప్రధాన కార్యాలయం, రాష్ట్ర తీర భద్రతా ఆపరేషన్ సెంటర్ (SCSOC), విశాఖపట్నం ఆధ్వర్యంలో DIG శ్రీ రాజేశ్ మిట్టల్ గారి అధ్యక్షతన కోస్టల్ సెక్యూరిటీ పోలీస్, స్థానిక పోలీసులు, కోస్ట్ గార్డ్స్, నేవీ మరియు ఫిషరీస్ శాఖల వంటి ముఖ్య విభాగాల సమన్వయంతో నిర్వహించబడింది. ప్రతి సంవత్సరం రెండుసార్లు నిర్వహించబడే ఈ “సాగర కవచ్” వ్యాయామం, ఆంధ్రప్రదేశ్ తీరప్రాంత భద్రతను బలోపేతం చేయడం మరియు దేశ విరోధక అంశాలు, ఉగ్రవాదుల చొరబాట్లను నిరోధించడం లక్ష్యంగా ఉంచుకుంది.
ఈ వ్యాయామంలో కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ ఇన్చార్జ్ మరియు విశాఖపట్నం రేంజ్ DIG శ్రీ గోపీనాథ్ జట్టి, IPS నాయకత్వంలో, మొత్తం 1 అదనపు SP, 1 DSP, 21 SHOs/ఇన్స్పెక్టర్లు, 42 SIs మరియు 377 కోస్టల్ సెక్యురిటీ పోలీస్ సిబ్బంది, అలాగే 1336 స్థానిక పోలీసు సిబ్బంది — మొత్తం 1778 మంది రెండు రోజులపాటు ఈ వ్యాయామంలో పాల్గొన్నారు. ఈ వ్యాయామంలో దళాలను “రెడ్ ఫోర్స్” (శత్రువులు) మరియు “బ్లూ ఫోర్స్” (దేశ రక్షకులు)గా విభజించగా, బ్లూ ఫోర్స్ అప్రమత్తతను పరీక్షించేందుకు “రెడ్ ఫోర్స్” సిబ్బందితో కొన్ని సిమ్యులేషన్/డీకాయ్ ఆపరేషన్లు నిర్వహించబడ్డాయి.
రెండు రోజుల వ్యాయామ సమయంలో, 47 మంది రెడ్ ఫోర్స్ సభ్యులను (శత్రువులు) 89 మంది బ్లూ ఫోర్స్ సభ్యులు (రక్షకులు) 18 వివిధ సంఘటనల్లో అదుపులోకి తీసుకున్నారు. ఇది బ్లూ ఫోర్స్ సిబ్బంది తీరప్రాంతంలో తమ విధుల్లో ఉన్నతమైన అప్రమత్తతను చూపుతుంది. ఈసారి సాగర కవచ్ వ్యాయామం అత్యంత పద్ధతిగా, సమర్థవంతంగా మరియు ఫలప్రదంగా నిర్వహించబడింది.
ఈ సందర్భంలో “సాగర కవచ్-02/2025” వ్యాయామంలో పాల్గొని విజయవంతం చేసిన రెడ్ మరియు బ్లూ ఫోర్స్ సిబ్బంది, కోస్టల్ సెక్యూరిటీ పోలీస్, స్థానిక పోలీసులు, కోస్ట్ గార్డ్స్, నేవీ మరియు ఫిషరీస్ శాఖ సిబ్బందికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. సిమ్యులేషన్/డీకాయ్ ఆపరేషన్లలో పాల్గొన్న రెడ్ మరియు బ్లూ ఫోర్స్ సిబ్బందికి తగిన బహుమతులు అందజేయబడతాయి అని తెలియజేసారు


