వాకర్స్ ఇంటర్నేషనల్’ లో గత 40 సం.లుగా ఎనలేని సేవలనందిస్తూ, వాకర్స్ ఉద్యమ స్ఫూర్తి ప్రధాతగా నిలుస్తూ ‘ వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రతిష్టాత్మక అవార్డు’ ను “విశ్వ విఖ్యాత వాకర్ మిత్ర” విశిష్ట సేవా పురస్కారాన్ని ప్రముఖ సంఘ సేవకులు, వాకర్స్ ఇంటర్నేషనల్ కాన్ఫరన్స్ చైర్మన్
డా. కమల్ బయిద్ అందుకున్నారు. సిరిపురం ఉడా చిల్డ్రన్స్ ఎరీనా పార్కులో అంగరంగ వైభవంగా ముగిసిన ‘అంతర్జాతీయ వాకర్స్ సదస్సు’లో “వాకర్స్ ఇంటర్నేషనల్” చీఫ్ ట్రస్టీ కె. రామానందం, అధ్యక్షులు కె.పద్మావతి, పూర్వ అధ్యక్షులు డా. ఎస్ పి.రవీంద్ర, మీడియా కన్వీనర్స్ నండూరి రామకృష్ణ , సి హెచ్ శ్రీనివాసరాజు, ప్రతినిధులు డాక్టర్ డి డి నాయుడు, కె ద్వారకానాధ్, యూత్ ఛైర్ పర్సన్ వంశీ చింతలపాటి తదితరులు పాల్గొని డా.కమల్ బయిద్ సేవలను కొనియాడుతూ ఆయనని ఘనంగా సత్కరించారు .
“నడవండి- నడిపించండి” నినాదంతో 1986 సం. లో స్వర్గీయ సుంకర ఆళ్వార్ దాస్ స్థాపించిన వాకర్స్ ఇంటర్నేషనల్ నేడు దేశవిదేశాలలో 1650 శాఖలుగా విస్తరించి, మూడు లక్షలకు పైగా వాకర్స్ సభ్యులతో విరాజిల్లి తున్నదనని డా. ఎస్. పి రవీంద్ర తెలిపారు.


