ఖమ్మం జనవరి
(పున్నమి ప్రతినిధి)
రైతు సంక్షేమం, సమాజ ఆరోగ్యం లక్ష్యంగా ఈ నెల 20-01-2026 (సోమవారం) ఉదయం 9:30 గంటలకు “సుఫలయాత్ర” పాదయాత్ర నిర్వహించనున్నట్లు బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకులు గల్లా సత్యనారాయణ తెలిపారు.
నేలకొండపల్లి నుండి భక్త రామదాసు ధ్యాన మందిరం వరకు ఈ పాదయాత్ర కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో #శ్రీశ్రీశ్రీ #త్రిదండి #చిన్నశ్రీమన్నారాయణ #రామానుజజీయర్ #స్వామి వారి పాదయాత్రగా భక్త బృందం, రైతు సోదరులతో కలిసి ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ సుఫలయాత్ర ద్వారా రైతుల సంక్షేమం, సమాజానికి ఆరోగ్య పరిరక్షణపై అవగాహన పెంపొందించడమే ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. భక్తులు, రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ పాదయాత్రను జయప్రదం చేయాలని గల్లా సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు.



