తిరుపతి ఆర్డీవో రామ్మోహన్ రామచంద్రపురం మండలంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారులకు అందించారు.
రామచంద్రపురం 01 నవంబర్ పున్నమి ప్రతినిధి
తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలంలోని సి రామాపురం ఎస్టీ కాలనీలో తిరుపతి ఆర్డీవో రామ్మోహన్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారులు ఇంటికి వెళ్లి అందించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ ప్రతి నెల ఒకటో తేదీ లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అర్హులందరికీ అందించడంతో వారందరూ సంతోషంగా ఉండారన్నారు. సచివాలయ సిబ్బంది కూడా ఉదయం 6:30 గంటలకే మండలంలోని గ్రామాలలో లబ్ధిదారుల ఇంటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను అందించడం జరుగుతున్నదన్నారు. మొదటి రోజే 100% పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల తాహసిల్దార్ మధుసూదన్ రావు, ఇన్చార్జ్ ఎంపీడీవో శ్రీనివాసులు, కూటమి నాయకులు కేసులు నాయుడు, నరసింహారెడ్డి , కోలాహరిప్రసాద్ , విజయ్ కుమార్, మునిరామిరెడ్డి, సురేంద్ర నాయుడు, హరి ప్రసాద్, రవి , కార్యకర్తలు రెవిన్యూ సిబ్బంది, సచివాలయ సిబ్బంది తదితరులుపాల్గొన్నారు.


