తాళ్లపూడి (పున్నమి ప్రతినిధి )మార్చి 10:: కొవ్వూరు మరియు తాళ్లపూడి ఇసుక ర్యాంపుల నుండి వచ్చే ఇసుక లారీల వలన ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తాళ్లపూడి యువ ప్రెస్ టీంలో వచ్చిన వార్తలకు స్పందించిన కొవ్వూరు ఆర్డీవో ఎన్ రాజా రమేష్ మరియు మండల తాసిల్దార్ లక్ష్మీ లావణ్య. మంగళ వారం తాళ్లపూడి రెవెన్యూ కార్యాలయానికి విచ్చేసిన ఆయన యువర్ ప్రెస్ టీం సభ్యులతో మాట్లాడుతూ వాహనదారులను ఇబ్బంది పెడుతూ లారీలపై ఓవర్ లోడ్ ఇసుక రవాణా జరిపితే ఇసుక ర్యాంపు యాజమాన్యంపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. ఇసుక రవాణా చేసే ప్రతి లారీ కు టార్పాలిన్ పూర్తిగా కట్టుకోవాలని, అలాగే ఓవర్ లోడు వేసిన లారీలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. రెండు మూడు రోజుల్లో ర్యాంపులు పరిశీలించడం జరుగుతుందని ఇసుక రవాణా విషయంలో అవకతవకలు గుర్తించినట్లయితే చర్యలు తప్పవని అన్నారు. కొవ్వూరు ఆర్డీవో గా బాధ్యతలు తీసుకున్న అనంతరం తాళ్లపూడి మండల రెవెన్యూ కార్యాలయం మంగళవారం సందర్శించినట్లు ఆయన తెలిపారు.

యువ ప్రెస్ టీం వార్తలకు స్పందించిన అధికారులు
తాళ్లపూడి (పున్నమి ప్రతినిధి )మార్చి 10:: కొవ్వూరు మరియు తాళ్లపూడి ఇసుక ర్యాంపుల నుండి వచ్చే ఇసుక లారీల వలన ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తాళ్లపూడి యువ ప్రెస్ టీంలో వచ్చిన వార్తలకు స్పందించిన కొవ్వూరు ఆర్డీవో ఎన్ రాజా రమేష్ మరియు మండల తాసిల్దార్ లక్ష్మీ లావణ్య. మంగళ వారం తాళ్లపూడి రెవెన్యూ కార్యాలయానికి విచ్చేసిన ఆయన యువర్ ప్రెస్ టీం సభ్యులతో మాట్లాడుతూ వాహనదారులను ఇబ్బంది పెడుతూ లారీలపై ఓవర్ లోడ్ ఇసుక రవాణా జరిపితే ఇసుక ర్యాంపు యాజమాన్యంపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. ఇసుక రవాణా చేసే ప్రతి లారీ కు టార్పాలిన్ పూర్తిగా కట్టుకోవాలని, అలాగే ఓవర్ లోడు వేసిన లారీలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. రెండు మూడు రోజుల్లో ర్యాంపులు పరిశీలించడం జరుగుతుందని ఇసుక రవాణా విషయంలో అవకతవకలు గుర్తించినట్లయితే చర్యలు తప్పవని అన్నారు. కొవ్వూరు ఆర్డీవో గా బాధ్యతలు తీసుకున్న అనంతరం తాళ్లపూడి మండల రెవెన్యూ కార్యాలయం మంగళవారం సందర్శించినట్లు ఆయన తెలిపారు.

