శ్రీకాళహస్తి, మార్చి 16 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన మైనార్టీ మహిళా నాయకురాలు షర్మిల ఠాగూర్ కుటుంబంలో ఇటీవల చోటుచేసుకున్న విషాదం పట్ల మాజీ ఎమ్మెల్యే బియ్యపు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. షర్మిల ఠాగూర్ కుటుంబ సభ్యులు షేక్ ఫాతిమా, షేక్ మలాన్ ఇటీవల అనారోగ్యంతో ఆకస్మికంగా మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సోమవారం నాడు వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ధైర్యం చెప్పారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు వ్యక్తిగతంగా కూడా తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి షేక్ సిరాజ్ బాషా, మైనారిటీ సెల్ అధ్యక్షుడు పఠాన్ ఫరీద్, సాగిరాభి, యువజన విభాగం అధ్యక్షుడు శ్రీవారి సురేష్, జూమ్లేష, ఫజల్, గఫూర్, ఆరిఫ్, పట్టణ యువత అధ్యక్షుడు మునికృష్ణారెడ్డి, అమ్మపాలెం సిరాజ్, జిలాని, అస్లాం, ఫిరోజ్, గౌస్ బాషా, షఫీ, కరిముల్లా, రసూల్, గిరి, చింత రాజేంద్ర, మురళి, నాగరాజు, రవి, నారాయణ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మైనార్టీ మహిళా నాయకురాలి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
శ్రీకాళహస్తి, మార్చి 16 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన మైనార్టీ మహిళా నాయకురాలు షర్మిల ఠాగూర్ కుటుంబంలో ఇటీవల చోటుచేసుకున్న విషాదం పట్ల మాజీ ఎమ్మెల్యే బియ్యపు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. షర్మిల ఠాగూర్ కుటుంబ సభ్యులు షేక్ ఫాతిమా, షేక్ మలాన్ ఇటీవల అనారోగ్యంతో ఆకస్మికంగా మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సోమవారం నాడు వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ధైర్యం చెప్పారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు వ్యక్తిగతంగా కూడా తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి షేక్ సిరాజ్ బాషా, మైనారిటీ సెల్ అధ్యక్షుడు పఠాన్ ఫరీద్, సాగిరాభి, యువజన విభాగం అధ్యక్షుడు శ్రీవారి సురేష్, జూమ్లేష, ఫజల్, గఫూర్, ఆరిఫ్, పట్టణ యువత అధ్యక్షుడు మునికృష్ణారెడ్డి, అమ్మపాలెం సిరాజ్, జిలాని, అస్లాం, ఫిరోజ్, గౌస్ బాషా, షఫీ, కరిముల్లా, రసూల్, గిరి, చింత రాజేంద్ర, మురళి, నాగరాజు, రవి, నారాయణ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

