ముస్తాబాద్లో దొడ్డి కొమురయ్య 119వ జయంతి ఘనంగా నిర్వహణ
ముస్తా బాద్ /ఎప్రిల్ /పున్నమి ప్రతినిధి
ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో దొడ్డి కొమురయ్య గారి 119వ జయంతి మహోత్సవాన్ని శ్రీ కృష్ణ యాదవ సంఘం మండల అధ్యక్షులు రాగం నాగరాజు గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యాదవ, కురుమ కుల బాంధవులతో పాటు ముస్తాబాద్ మండలంలోని అన్ని గ్రామాల కుల బాంధవులు పాల్గొన్నారు.
ముందుగా దొడ్డి కొమురయ్య గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ముస్తాబాద్ గ్రామ సర్పంచ్ మట్ట వెంకటేశ్వర్ రెడ్డి, సెస్ డైరెక్టర్ సందు పట్ల అంజి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్ల బాల్ రెడ్డి, నరసింహారెడ్డి, సర్వర్ గారు, వివిధ గ్రామాల పెద్దలు, CWFI రాష్ట్ర కమిటీ సభ్యులు గీస బిక్షపతి, కోఢె శీను, శీలం స్వామి తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాన్ని గ్రామ పెద్దలు,
వివిద కుల బాంధవులు కలిసి విజయవంతం చేశారు.


